మల్కాజిగిరి పార్లమెంట్ : కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, కొంపల్లి ఎన్.సి.ఎల్ కాలనిలో ఏర్పాటు చేసిన భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.మంత్రిగా ఉండి ఈ మంత్రి పదవి కంటే నా దేశమే ముఖ్యమని.. ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి అని.. ఒకే దేశంలో రెండు జెండాలు రెండు చట్టాలు ఉండకూడదని మొట్టమొదటిగా అక్రోషించిన వ్యక్తి శ్యామ ప్రసాద ముఖర్జీ గారు. 70 సంవత్సరాల భారతీయ ప్రజల అంతరంగాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దానిని నెరవేర్చి జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాదు చేసి చూపించిన ఘనత ప్రధాని మోడీ గారికి దక్కింది.
శ్యామ ప్రసాద ముఖర్జీ గారు గొప్ప తత్వవేత్త, విద్యా వేత్త వారు ఉపాధ్యాయ గారు కలిసి జనసంఘ్ ఏర్పాటు చేసి భారతీయులందరినీ ఏకీకరణ చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఎమర్జెన్సీ కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇప్పుడు ఇక్కడున్న ఎన్సీఎల్ కాలనీలో అప్పట్లో పందిరి వ్యవసాయం జరిగేది. ఈ ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది. ప్రకృతిని మనం ప్రేమించకుంటే.. కాపాడకుంటే మానవ మనగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ప్రకృతిని నాశనం చేస్తే మనం కూడా నాశనం అవుతాము.గ్లోబల్ వార్మింగ్ తో దృవాలు కరిగిపోతున్నాయి.ఢిల్లీ లో రాత్రి 10 గంటలకు కూడా వేడి గాలి చెంపకు తాకుతుంది.
ఒకప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం జరిగేది. అప్పుడు ఇన్ని రకాల జబ్బులు లేవు. మనిషి స్వార్థం కోసం చేస్తున్న కల్తీ వల్ల అనేకమంది చనిపోతున్నారు. రోగాల బారిన పడుతున్నారు.ప్రకృతిని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలి అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి, విక్రమ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జరిగే శేఖర్ ముదిరాజ్, శేఖర్ యాదవ్, కార్పొరేటర్ రావుల శేషగిరి, శివాజీ రాజు, రాజిరెడ్డి, కట్ట కుమార్, సాయినాథ్ నేత, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రంగంపేట, భీమరాజు, లక్ష్మీపతి రాజు, సతీష్ సాగర్, మాధవి, శివానంద్, ఝాన్సీ గార్లు, మరియు స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa