కల్వల గ్రామానికి చెందిన చిరగాని కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు ఓరుగంటి వెంకన్న మోడం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడమే లక్ష్యంగా సమ్మిగౌడ్ ఫౌండేషన్ పని చేస్తుందని ఎంతోమందికి అండగా ఉంటూ ఆదరిస్తున్న ఫౌండేషన్ అని ఇలాంటి మంచి మనసుతో ముందుకొచ్చి సేవ చేయడం అనేది గర్వించదగ్గ విషయమని అన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండి శ్రీనివాస్ పొడేటి దినేష్ లు మాట్లాడుతూ ఎలాంటి పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా సేవలందిస్తూ ఏదో మొక్కుబడిగా ఇతరుల మెప్పు కొరకు ఒక్కరికి ఇద్దరికే కాకుండా మంచి ఆలోచనతో ఫౌండేషన్ నుండి ఎన్నో కుటుంబాలకు అండగా నిలబడుతున్నారని ఎన్నో కుటుంబాలలో ఆసరాగా ఉంటూ ఆనందాన్ని నింపుతున్నారని అలాంటి సమ్మి గౌడ్ ఫౌండేషన్ ఇప్పుడు మండల కేంద్రంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు.ఈ పరామర్శలో సమ్మి గౌడ్ వెంట ఫౌండేషన్ సభ్యులు సాయి గౌడ్, గండి వీరేందర్,కొండేటి కళాధర్,పబ్బతి ప్రశాంత్ గౌడ్,సతీష్ గౌడ్,రేసు సాయి గౌడ్, రాజేందర్,శ్రావణ్, సురేందర్,మనోజ్, మునేష్,,వల్లాల యాకన్న, చిరగాని చిన్న నారాయణ,చిరగాని బిక్షం, బొగ్గుల చంద్రం, ఓరుగంటి కృష్ణమూర్తి, కదిరి వెంకన్న,పోడేటి రామచంద్రయ్య,మాచర్ల మల్లేశం,కదిరే ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa