మేడ్చల్ జిల్లా శామీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. చెరువులో దూకి తనువు చాలించింది. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రానికి చెందిన మర్కంటి భానుప్రియ(28) మర్కంటి స్వామి దంపతులు. ఈనెల 15న భార్యభర్తలు గొడవపడ్డారు. దీంతో కుమారుడు దేవాన్ష్ ఆనంద్(5), కూతురు దీక్ష(4) లతో కలిసి భానుప్రియ ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
కాసేపటికి భర్త చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో రుసటి రోజు ములుగు పోలీస్ స్టేషన్లో స్వామి ఫిర్యాదు చేశాడు. తన భార్య ఇద్దరు పిల్లలు తప్పిపోయారని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే శనివారం సాయంత్రం ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శామీర్ పేట్ పరిధిలోని శాంభపేట్ పెద్ద చెరువులో దూకి సూసైడ్ చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా చిన్నారుల శవాలను బయటకు తీశారు. అర్ధరాత్రి తర్వాత మహిళ మృతదేహం లభ్యమైంది.
మృతదేహలను పరిశీలించి వారు ములుగుకు చెందిన మర్కంటి భానుప్రియ వారి పిల్లలుగా గుర్తించారు. ఈ మేరకు స్వామికి సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలా.. మరేదైనా కారణంతో సూసైడ్ చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
పెళ్లి చూపులకు వెళుతూ... మరో ఘటనలో పెళ్లి చూపులకు బయల్దేరిన ఓ యువకుడు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన రాంపంగి సురేష్ పెళ్లి చూపుల కోసం బైక్పై సూర్యాపేట బయల్దేరాడు. అయితే అతడు మాధవరం వద్దకు రాగానే టిప్పర్ లారీ అతడి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో యువకుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa