మాజీ మంత్రి, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు లైంగిక వేధింపుల కేసులో భారీ ఊరట లభించింది. సోమవారం ఈ కేసును విచారించిన బెంగళూరు కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ కుమారుడైన రేవణ్ణపై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణలను కోర్టు కొట్టివేసింది.ఈ కేసులో న్యాయమూర్తి కె.ఎన్. శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంలో చాలా ఆలస్యం జరిగినట్లు కోర్టు గుర్తించింది. కేవలం ఈ ఒక్క కారణంతోనే రేవణ్ణపై ఉన్న ఆరోపణలను కొట్టివేయవచ్చని, ఆయనను నిర్దోషిగా ప్రకటించడానికి ఇది తగిన ఆధారమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. హసన్ జిల్లా హోలెనరసిపుర పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో గతంలో ఆయనపై సెక్షన్ 354, 354ఎ కింద అభియోగాలు నమోదయ్యాయి.2024 ఏప్రిల్లో రేవణ్ణ ఇంట్లో పనిచేసే ఓ మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు అంతకుముందే సెక్షన్ 354ను కొట్టివేసింది. తాజాగా సెక్షన్ 354ఎ నుంచి కూడా బెంగళూరు కోర్టు విముక్తి కల్పించడంతో రేవణ్ణపై ఉన్న లైంగిక వేధింపుల కేసులు పూర్తిగా ముగిశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa