ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వానికి వంత పాడుతున్న పోలీసుల చర్యలను చట్టపరంగా ఎదుర్కొంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 12:49 PM

రాష్ట్రంలో రాజకీయ వేధింపులు మితిమీరి పోతున్నాయని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. నిన్న ఆయన పార్టీ లీగల్ సెల్ నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడాన్ని ఓర్వలేక వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నియంతృత్వ పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి వంత పాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దామని ఆయన అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంపై పోరాటం చేస్తూ ముందుకెళ్తున్న పార్టీ లీగల్ సెల్‌ను ఆయన అభినందించారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు పొట్టేళ్ల తలలతో హారం వేసిన ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇటీవల ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారని, దీనికంటే దారుణం మరొకటి ఉండదని సజ్జల అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa