అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని తన నివాసంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్లో పేర్కొంది. ఆమె ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడు లేకుండా జీవించలేనని, అయితే తాను మరొక యువకుడిని ప్రేమిస్తున్నానని భావించి, మొదట ప్రేమించిన వ్యక్తి తనతో మాట్లాడటం లేదని, తన తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసింది.ఇదిలా ఉంటే, పుస్తకాలు కొనుగోలు చేయడానికి వెళ్ళిన సమయంలో తమ కుమార్తె ఒక యువకుడితో గొడవ పడటం చూశామని, ఆ సంఘటన తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa