ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వాలు మారిన మారని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల బ్రతుకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2024, 04:46 PM

ఆదివారం ఆర్జీ-3 లో వివిధ విభాగాలను కార్మికుల తో సమావేశాలు చేస్తున్న క్రమంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న సింగరేణి లో కాంట్రాక్టు వ్యవస్థ ప్రారంభం నుండి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్పటికీ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు నేటికీ కనీస వేతనాలు చట్టబద్ధమైన హక్కులు అమలు కానీ పరిస్థితి కొనసాగుతుంది.
ఈ పరిశ్రమ కోట్లాది రూపాల లాభాలతో ఉన్నప్పటికీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు పన్నుల రూపేనా చెల్లిస్తున్నప్పటికీ అతి తక్కువ వేతనాలతో శ్రమదోపిడికి గురవుతున్న కాంట్రాక్టు కార్మికులను ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రచారంలో ఒక ప్రభుత్వం పర్మినెంట్ చేస్తామని చివరకు నిండు సభలో కార్మికులే లేరని మాట్లాడటం నేటి ప్రభుత్వం కోలిండియా వేతనాలు అమలు చేయిస్తామని మాటలకే పరిమితమై నేటికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణితో ఐదు దపాల సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పటికీ అసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికుల గురించి మాట్లాడినప్పటికీ వీరికి నేటికీ కూడా చట్టబద్ధ హక్కులు, లీవులు, పండుగ మాస్టర్లు సర్వీస్ పే, ఉచిత వైద్యం, ఇన్సూరెన్స్, ప్రమాదంలో చనిపోతే నష్టపరిహారం ఉద్యోగ భద్రత ఇది బొగ్గు పరిశ్రమ అయి ఉండి కోలిండియా వేతనాలు అమలు కాక రోడ్ అండ్ బిల్డింగ్ మాత్రం అమలు చేస్తూ సీఎం పిఎఫ్ కటింగ్ పేరిట కార్మికులకు సరియైన లెక్కలు నేటికీ చూపకపోవడం అదే విధంగా కార్మికుడికి ఏమైనా ఆరోగ్య ఇబ్బందులు ఉండి డ్యూటీకి రాకపోతే పెనాల్టీ ల పేరిట చేసిన వేతనం నుండి రికవరీ చేయడం లాంటి దుర్మార్గమైన చట్టాలను అమలు చేస్తున్న సింగరేణిపై పలుదపాలుగా ఉద్యమాలు సమ్మెలు చేసినప్పటికీ దున్నపోతుపై వర్షం పడ్డ చందముగా సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తున్నది పాలకులు కూడా ఈ కార్మికుల ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చాక వీరిని మర్చిపోవడం ఆనవాయితీగా జరుగుతున్నది కాబట్టి ఇప్పటికైనా ఈ కార్మికుల విషయాలను పట్టించుకోని వారికి రావలసిన చట్టబద్ధమైన హక్కులు సౌకర్యాలు అమలు చేయకపోతే మరో మారు సింగరేణిలో పోరాటం చేయవలసి వస్తుందని సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పి రాజనర్సు, జి.నర్సయ్య, పి.రమేష్, పి.మొండయ్య, రాజ మొగిలి, ఎస్.శ్రీనివాస్, ఈ సుధాకర్, సిహెచ్ శ్రీనివాస్, రమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa