సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ఆరెపల్లి గ్రామ పరిధిలోని చంద్రనాయక్ తండాలో డాక్టర్. నరేష్ నాయక్ అధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 2కె రన్ ఫర్ హెల్త్ పేరుతో కార్యక్రమ నిర్వాహకులు అతిథులుగా వచ్చిన ప్రముఖులు గ్రామస్థులు యువకులు రన్నింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, కోహెడ ఎస్సై చందా తిరుపతి, డాక్టర్.శ్రీనివాస్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మంద ధర్మయ్య, బీఆర్ఎస్ నాయకులు కొక్కుల సురేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, గవ్వ వంశీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి మంద ధయాకర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి మాట్లాడుతూ యువకులు నిరుద్యోగులు ఈమధ్య కాలంలో డ్రగ్స్ మహమ్మారికి కనెక్టవుతున్నారని అన్నారు.
మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల యుక్తవయసులోనే క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాదుల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం లేదా కలిగిఉండటం లేదా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని డ్రగ్స్ కేసులో ఒక్కసారి పట్టుబడితే కనీసం 10 సంవత్సరాల శిక్షను అనుభవించవలసి వస్తుందని రౌడీషీట్ ఓపెన్ అయితే జీవితమంతా అంధకారం అయిపోతుందని అన్నారు. యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా శ్రద్ధగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలను సాధించి కన్న తల్లిదండ్రులకు పుట్టిపెరిగిన ఊరికి గొప్ప పేరు తేవాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో బాధ్యత కలిగిన ప్రతీ ఒక్కరూ డ్రగ్స్ పై పోరాడాలని, డ్రగ్స్ రహిత తెలంగాణ మనందరి బాధ్యతని కర్ర శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమనికి సహకరించిన సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బూరుగుల రమేష్, బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు గువ్వాడి రవి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa