రైతు రుణమాఫీ పైన మాజీ మంత్రులు కేటిఆర్,హరీష్ రావు మరియు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,2014 నుండి మీరు రైతులకు ఇచ్చిన ఏ మాటను అయినా నిలబెట్టుకున్నారా అని,రైతులకు మీరు చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా అని,మేము నూతనంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం.
జరిగిందని,ధర్మపురి నియోజక వర్గంలోనీ ధర్మారం మండలంలో మొదటి విడతలో సుమారు 4 వేలకు పైగా రైతులకు 23 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేయడం జరిగిందని, రెండో విడతలో 18 కోట్లు,మూడో విడతలో 18 కోట్లు రూపాయలను విడుదల చేయడం జరిగిందని, 10సంవత్సరాలు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ నాయకులు,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతులనుండి మిల్లర్లు బస్తకు 5 కిలోలు తాలు తప్ప పేరుతో కట్టింగ్ చేస్తుంటే కనీసం రైతుల దగ్గరకి కూడా వెళ్లి అడిగింది లేదని,ఇట్టి రుణమాఫీకి సంబంధించి కొన్ని పొరపాట్లు,ఇబ్బందులు జరిగి కొంత మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అట్టి రైతులకు సంబంధించి 45 దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని,వాటిని కూడా త్వరలోనే పరిష్కరించి వారికి సాధ్యమైనంత త్వరగా రుణమాఫీ అయ్యేలా చూస్తామని, 80 శాతం రుణమాఫీ చేసినవాళ్ళం 20 శాతం చేయలేమా అని,రైతులు ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని,అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చూస్తామని,ఒక ప్రజా ప్రతినిధిగా అది మా బాధ్యత అని , ఈ మోసపూరిత మాటలను రైతులు ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని,ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa