సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామికి బిగ్ షాక్ ఇచ్చింది నాంపల్లి న్యాయస్థానం. వేణు స్వామిపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జాతకాల పేరు చెప్పి.. ప్రజలను వేణు స్వామి మోసం చేస్తున్నారని.. ప్రధానమంత్రి ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి మాయమాటలతో అమాయకులను నమ్మించి తప్పుదోవ పట్టించారంటూ నాంపల్లి కోర్టులో జర్నిలిస్ట్ మూర్తి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వేణు స్వామి చేస్తున్న మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు గానూ.. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ.. కుట్రపన్నారని పిటిషన్లో మూర్తి ఆరోపించారు.
అయితే.. జర్నలిస్ట్ మూర్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ను ధర్మాసనం విచారించింది. కాగా.. పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించటమే కాకుండా.. వేణు స్వామిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు ఆదేశాలతో వేణుస్వామిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. మరి అరెస్ట్ చేసి విచారిస్తారా లేదా.. సాధారణంగానే విచారణ జరుపుతారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
అయితే.. సెలెబ్రిటీలో జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి.. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తుంటారు. అటు.. సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖలకు సంబంధించిన జాతకాలను చెప్తూ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుంటారు. అయితే.. వాటి గురించి ఎవరూ అడగకపోయినా.. తనకు తానుగా చెప్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు మన వేణు స్వామి.
గతంలో.. సమంత- నాగచైతన్య వివాహ జీవితంపై సంచలన ఆరోపణలు చేసి.. ఒక్కసారిగా ఫేమస్ అయిన వేణుస్వామి.. ఇప్పుడు కూడా నాగచైతన్య- శోభితా దూలిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత వారి వైవాహిక జీవితం గురించి కీలక ఆరోపణలు చేసి.. అంతకు మింది వివాదాల్లో ఇరుక్కున్నారు. సమంత, నాగ చైతన్య విడిపోయినట్టుగానే.. శోభిత దూలిపాళ్ల, నాగచైతన్య కూడా కొద్ది రోజులకే విడిపోతారంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే.. వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ను సినీ ఇండస్ట్రీలోని పలువురు సీరియస్గా తీసుకుని.. ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల పర్సనల్ జీవితంపై ఇలా నిరాధారంగా ఆరోపణలు చేస్తుండటం, వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించమేనని అభిప్రాయపడ్డారు. ఇక.. వేణుస్వామి తీరుపై సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్.. ఏకంగా మహిళా కమిషన్ ఛైర్మన్కు ఫిర్యాదు కూడా చేయటం గమనార్హం.
ఈ క్రమంలోనే.. జర్నలిస్టు మూర్తిపై వేణుస్వామి, ఆయన సతీమణి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. తమను జర్నలిస్టు మూర్తి.. భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని.. ఇవ్వకపోయేసరికి తనను టార్గెట్ చేశాడంటూ ఘాటు ఆరోపణలు చేశారు. తమకు మూర్తి నుంచి ప్రాణ హాని ఉందని.. కూడా ఆరోపించారు. దీంతో.. ఆ ఆరోపణలపై స్పందించిన మూర్తి.. పోలీసులుక ఫిర్యాదు చేయటంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa