ఖమ్మం, సెప్టెంబర్ 13 (శుక్రవారం):` దేశానికి దిశానిర్దేశం చేసే అనేక చట్టాల రూపకల్పనలో కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరించారు.. వాటిలో సీతారాం ఏచూరి పాత్ర ఎనలేనిదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
మార్క్సిజం విలువల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన అఖిల భారత సీపీఐ(ఎం) కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. సీతారాం ఏచూరి మృతికి సంతాపంగా ఆయన చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళి అర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa