ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నలగొండ జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై గౌరవ వందన స్వీకరించి అనంతరం జండా ఆవిష్కరణ చేశారు ఎందరో మహనీయుల త్యాగం మన తెలంగాణ పరిపాలనలో ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మనకు గుర్తుంటాయి నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాల్గొన ఉంటుందని తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు వారి ఆలోచనలే మా ఆచరణ వారి ఆకాంక్షల మా కార్యచరణ అని తెలిపారు .
తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరుల దేనని తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కీలకమైన రోజని, నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తిని పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవర్, ప్రజా ప్రతినిధులు నాయకులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa