ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తనిఖీల్లో పట్టుబడ్డ పీడీఎస్ రైస్ సెప్టెంబర్ 27నబహిరంగ వేలం: జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్.జితేందర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 10:14 AM

జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ పిడిఎఎస్ బియ్యాన్ని వేలం వేసేందుకు సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు., 1088 క్వింటాళ్ల రైస్ తో పాటుగా 167 క్వింటాళ్ల తినడానికి పనికిరాని బియ్యం వేలం వేసేందుకు  ప్రకటన జారీ చేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి పేరు మీద ₹ 3,000 నాన్ రిఫండబుల్  డిడి తీసిన వారు వేలంలో పాల్గొనవచ్చునని ప్రకటనలో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 27న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు వేలం వేస్తున్నట్లుగా తెలిపారు. వేలంలో పాల్గొన తలచిన వారు 2 లక్షలు ధరావత్తు గా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ పేరున డిడి తీయవలసి ఉంటుందని పూర్తి సమాచారం కోసం జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa