సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలోని మల్లన్న సాగర్ ముంపు బాధితులను కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి ఆయన సంచలన కామెంట్స్ చేశారు. రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్ట్ నుంచి హరీష్ భూములు తప్పించారని ఆరోపించారు. షాద్నగర్ ప్రాంతంలో హరీష్ రావుకు భూములున్నాయని.. రెండు రోజుల్లో ఆ భూముల దగ్గరకు వెళ్తానని చెప్పారు. హరీష్ భూముల్లో నుంచి వెళ్లకపోతే.. సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తానని కీలక కామెంట్స్ చేశారు.
ఇక మూసీ ఆక్రమణలపై స్పందించిన మైనంపల్లి.. మూసీ పక్కన ఉన్న పేదవాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటదన్నారు. హైదారాబాద్లో అక్రమ కట్టడాలు కట్టితే నిర్ధాక్షణంగా కూల్చేస్తామని ఆనాడు కేసీఆరే అన్నారని గుర్తు చేశారు. మూసీ నది క్లీన్ చేయడం వల్ల ఎంతో లాభం ఉంటుందని చెప్పారు. కూల్చివేతలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు అవసరమయితే తన డబ్బు, తన భార్య పేరున ఉన్న డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అందుకు కేసీఆర్, హరీష్ సిద్ధమా అని ప్రశ్నించారు.
'కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. వేల కోట్లు కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు వాడారు. హరీష్ రెండ్రోజుల్లో నీ ఫాంహౌస్కు వస్తున్నా. చెరువులో నీ ఫాంహౌస్ను కట్టుకున్నావ్. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ల్యాండ్ గ్లాబరులుగా ఉన్నారు. హైడ్రా విషయంలో బీజేపీతో సహా అన్ని పార్టీలు సహకరించాలి. విజయవాడ మాదిరిగా హైదారాబాద్ కాకూడదు. కేసీఆర్ ఫాం హౌస్ నుంచి షాద్నగర్ వద్ద హరీష్కు ఉన్న 70 ఎకరాల నుంచి ఆర్ఆర్ఆర్ రోడ్డు పోవాలి.
చెరువులో అన్నీ కబ్జా అయితే నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి. పెన్షన్లు, రైతుబండు, డబుల్ బెడ్ రూంకు ఎన్ని ఇచ్చినా అంతా ప్రజల డబ్బే. ఇష్టారీతిన అనుమతులు ఇచ్చి హరీష్ రావు, కేటీఆర్లు లక్షల కోట్లకు చేరుకున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మొత్తం దోచుకున్నారు. కేసీఆర్, హరీష్ దమ్ముంటే మీ డబ్బులు సరెండర్ చేయండి. నేను నా ఆస్తులు సరెండర్ చేస్తా. మీ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో ఇక ఉండేది కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే. బీఆర్ఎస్ పనైపోయింది. హైడ్రా పరిస్థితి ఒక కొలిక్కి వచ్చాక మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం.' అని మైనంపల్లి వ్యాఖ్యనించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa