ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నదాతకు తీపి కబురు.. పెరగనున్న ధరలు, క్వింటా రూ.7,600 పైగానే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:17 PM

తెలంగాణలో పత్తి కొనుగోళ్లు మెుదలయ్యాయి. రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సైతం విస్తృత ఏర్పాట్లు చేసింది. సీసీఐ కేంద్రాలు, ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొందరు రైతులు మార్కెట్‌కు తీసుకెళ్లి పత్తిని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్తి రైతులకు మరో శుభవార్త. పత్తి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మంచి ధర పలుకుతుండగా.. రానున్న రోజుల్లో పత్తి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.


ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం (అక్టోబర్ 4) కొత్త పత్తి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.7,111 వేలు పలికింది. మోడల్ పత్తి ధర రూ.6,500, కనిష్ఠంగా రూ.4,500 పలికింది. పాత పత్తికి గరిష్ఠంగా రూ.7,550, కనిష్ఠ ధర రూ.4,500 పలికింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో గరిష్ఠంగా పత్తి ధర రూ.7,600, మోడల్ ధర రూ.6,600, కనిష్ఠ ధర రూ.5,500 వరకు పలికిందని అధికారులు తెలిపారు. మేలు రకం కొత్త పత్తి ధర రూ.7,600కు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. ఈ ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్రంలో ఈ ఏడాది 43 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. పత్తి పంటను మార్కెట్లు, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేసిన తర్వాత.. ఆ డబ్బులు రైతులకు నేరుగా కాకుండా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ప్రస్తుతం చెల్లింపులు చేస్తున్నారు. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. నగదు చెల్లింపుల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా 'కాటన్‌ యాలీ' పేరిట ప్రత్యేక యాప్‌ తీసుకొస్తోంది. రైతులు సీసీఐకి తమ పంటను విక్రయించిన తర్వాత రైతులకు చెల్లించే డబ్బులు పోస్టాఫీసులో ఉన్నాయా ? లేక బ్యాంకు అకౌంట్లలో ఉన్నాయా ? ఆ డబ్బును డ్రా చేసుకోవటం తదితర విషయాలను ప్రత్యేకంగా రూపొందించిన 'కాటన్‌ యాలీ' యాప్‌ ద్వారా అన్నదాతలు సమ స్మార్ట్‌ఫోన్లలో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.


ఇక ప్రభుత్వం కొనుగోలు చేసిన పత్తిని అధికారులు ఎప్పటికప్పుడు గోదాములకు తరలిస్తున్నారు. సీసీఐ ద్వారా రైతులకు వెంటనే డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa