తెలంగాణలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వరుస వివాదాలు హాట్ టాపిక్గా మారాయి. మొన్నటివరకు మంత్రి కొండా సురేఖ మెడలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నూలు దండ వేయటంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగటం తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. ఆ తర్వాత కేటీఆర్ మీద విమర్శలు చేస్తూ అక్కినేని కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు చేయటం రాజకీయాలతో పాటు అటు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే.. కొండా సురేఖకు రేవంత్ రెడ్డి సర్కార్ ఝలక్ ఇచ్చింది.
మంత్రి కొండా సురేఖ దంపతులకు ప్రధాన అనుచరుడైన నవీన్ రాజ్కు ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు గన్ మెన్లను కేటాయించగా.. వారిని వెనక్కి తీసుకుంది. అయితే.. నవీన్ రాజ్ మీద కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మంత్రి పేరు చెప్పుకుంటూ వరంగల్ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు అధికారులను కూడా లెక్కచేయకుండా పెత్తన చేలాయిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి చేరటంతో.. రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. దీంతో.. వరంగల్ పోలీసులు తాగాజా నవీన్ రాజ్కు కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను వీఆర్కు అటాచ్ చేశారు. ఈమేరకు వరంగల్ సీపీ ఆదేశాలు జారీచేశారు. చాలా రోజులుగా నవీన్ రాజ్ మీద.. ఆరోపణలు వస్తున్నపపటికీ స్పందించని ప్రభుత్వం.. తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వివాదం నడుస్తున్న సమయంలోనే ఇలాంటి చర్యలు చేపట్టటం చర్చనీయాంశంగా మారింది.
అయితే.. అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖులు తీవ్రంగా ఖండించగా.. ఒకరిద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించకపోవటం గమనార్హం. అయితే.. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించగా.. వాళ్లు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంరించుకున్నానని చెప్పినా ఇంతగా దాడి చేయటమేంటని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడితే.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇక.. మహిళా కమిషన్ అయితే.. కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోయి ఉంటే కల్పించుకునేవాళ్లంటూ సింపుల్గా ఆ విషయాన్ని తేల్చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారని.. ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ కూడా అడిగారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa