ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా పండగ వేళ టీజీఎస్ఆర్టీసీ తీపికబురు.. వాళ్ల కోసం స్పెషల్‌ బస్సులు.. ఇక నో టెన్షన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 09:12 PM

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ దసరా పండుగ సందడి మామూలుగా లేదు. ఇప్పటికే.. స్కూళ్లు, కాలేజీలకు పండుగ సెలవులు ప్రకటించటంతో.. ప్రజలు సొంతూళ్లకు క్యూకట్టారు. దీంతో.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ తీపికబురు వినిపించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సు సర్వీసులను పెంచుతున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగుల సందర్భంగా.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. మొత్తంగా 6304 స్పెషల్ బ‌స్సుల‌ను న‌డిపిస్తన్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.


అయితే.. దసరా పండుగ సందర్భంగా పోలీస్, రవాణా శాఖల అధికారులతో సోమవారం (అక్టోబర్ 7న) రోజున సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా మాట్లాడిన సజ్జనార్.. స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు.. ఆర్టీసీ తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈసారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కూడా అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో.. గ‌తేడాదితో పోల్చితే ఈసారి రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని భావించి.. పోయినసారి కంటే అదనంగా 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ు నడిపించాలని నిర్ణయించినట్టు సజ్జనార్ పేర్కొన్నారు.


అందులోనూ.. ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు విపరీతమైన రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‎లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, సుచిత్ర, జగద్గిరిగుట్ట, బొరబండ, ఐఎస్ సదన్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్, శంషాబాద్‎లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుదని.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‎లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను క‌ల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను కూడా నియ‌మించామన్నారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను కూడా నియ‌మించినట్టు సజ్జనార్ తెలిపారు.


tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా బ‌స్సుల క‌ద‌లిక‌ల‌ను గుర్తించేంద‌కు గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa