ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున వేర్వేరుగా పరువునష్టం పిటిషన్లు దాఖలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2024, 02:37 PM

నాగచైతన్య, సమంత విడాకులు, తదితర అంశాలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హీరో నాగార్జున వేర్వేరుగా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్లపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున ఆమె న్యాయవాది గుర్మీత్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. తదుపరి విచారణ నవంబర్ 13వ తేదీన జరగనుంది.తనపై నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. గత విచారణ సందర్భంగా నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం కేటీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కేటీఆర్ మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు. అంతకుముందు, నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు వాంగ్మూలం నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa