ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడ్డంగా దొరికిపోయిన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు నడుపుతూనే జిప్ తీసి పని కానిచ్చేశాడు.. వీడియో వైరల్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 07:22 PM

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతుంటారు. కూర్చోవటానికే కాదు.. కనీసం నిల్చోడానికి కూడా స్థలం దొరకనంతగా రద్దీ ఉంటుంది అప్పుడప్పుడు. అలాంటి సమయాల్లో ప్రయాణికులు తమ లగేజీని.. పైన ఉన్న లజేజీ ర్యాక్‌‌లోనో.. లేదా సీట్ల కిందో.. ఇలా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పెట్టేసి నిల్చుని ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు దిగాలన్న తొందరలో తమ బ్యాగులను బస్సులోనే మర్చిపోయి వెళ్తుంటారు. అందరూ దిగిన తర్వాత.. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ సిబ్బంది.. వాటిని పరిశీలించి విలువైన వస్తువులు ఉంటే పోలీస్ స్టేషన్‌లో, నార్మల్ లగేజీ బ్యాగ్ అయితే డిపోలో ఇచ్చి.. సదరు ప్రయాణికులకు చేరేలా చొరవ తీసుకుంటుంటారు. అలాంటి ఘటనలు చాలానే చూశాం.


కానీ.. ఈ డ్రైవర్ మాత్రం దొరికిందే ఛాన్స్ అని.. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగు నుంచి బంగారు నగలను సైలెంట్‌గా నొక్కేశాడు. డ్రైవర్ చేతివాటాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు.. ఆయన భాగోతాన్ని తన ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ ఘటన.. నిజామాబాద్‌‌లో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి ఓ మహిళ నిజామాబాద్‌‌కు వెళ్తుంది. అయితే.. తనతో విలువైన బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్తోంది. కాగా.. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. తన బ్యాగును జాగ్రత్తగా పెట్టాలని భావించింది. డ్రైవర్ సీటు వెనకాల పెడితే ఎవరూ తీయలేరని భావించి.. అక్కడ భద్రంగా పెట్టింది.


అయితే.. బస్సులో ఉన్న ఏ ఒక్కరూ అక్కడికి వచ్చి ఆ బ్యాగులో ఉన్న నగలు కొట్టేయలేరని ఆ మహిళా భావించింది కానీ.. ఆ డ్రైవరే తన బంగారంపై కన్నేస్తాడని మాత్రం ఊహించలేకపోయింది. ఆ మహిళ ఎంత నమ్మకంగా పెట్టిందో.. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ఆర్టీసీ డ్రైవర్ తన చేతివాటాన్ని చూపించాడు. ఆ బ్యాగ్‌లో బంగారు ఆభరణాలు ఉన్నాయని గ్రహించిన డ్రైవర్.. సమయం చూసి అందులో ఉన్న బంగారు ఆభరణాలను సైలెంట్‌గా నొక్కేశాడు. అయితే.. డ్రైవర్ చేతివాటాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో ఈ భాగోతాన్ని రికార్డ్ చేశాడు.


అంతా అయిపోయిన తర్వాత.. ఆ ప్రయాణికుడు ఆ డ్రైవర్ భాగోతాన్ని బయటపెట్టాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించటంతో.. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. మొదట.. కింద పడితే తీసుకున్నానంటూ బుకాయించే ప్రయత్నం చేసిన డ్రైవర్.. ఆ తర్వాత తన దగ్గర వీడియో కూడా ఉందని చెప్పటంతో.. తానే తీశానంటూ తప్పు ఒప్పుకోవటమే కాకుండా.. క్షమించమని కూడా అడిగాడు.


ఈ ఘటనతో.. ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన ఆర్టీసీ సిబ్బందే ఇలాంటి పనులకు పాల్పడుతుండటంతో సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడున్న పోలీసులు కూడా.. ప్రయాణికులకు ఏమైనా జరిగితే అండగా నిలబడాల్సిన మనమే ఇలా చేస్తే ఎలా అంటూ ఆ డ్రైవర్‌ను ప్రశ్నించారు.


మరోవైపు.. ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న గొడవలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు మాయం అవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి నుంచి ముప్పారం గ్రామానికి నితీషా(37) అనే మహిళ వస్తోంది. ఈ క్రమంలోనే మరో ముగ్గురు మహిళలు సీటు కోసం నితీషాతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో కొట్టుకున్నారు కూడా. అయితే.. గొడవ తర్వాత చూసుకుంటే.. తన మెడలో ఉండాల్సిన బంగారు పుస్తెల తాడు కనిపించలేదు. దీంతో.. ఆ ముగ్గురు మహిళలే తన బంగారు పుస్తెల తాడు కొట్టేశారని ఆరోపించటంతో.. బస్సు కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. గొడవపడిన మహిళలతో పాటు మిగతా ప్రయాణికులందరినీ విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa