ఉపాద్యాయులంటే సమాజంలో మంచి పేరు, గౌరవం ఉంటుంది. విద్యార్థులను తమ పిల్లలుగా భావించి.. సమాజానికి మంచి పౌరులను అందించాలని పరితపిస్తుంటారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారు చేరుకోవాల్సిన లక్ష్యాలకు మార్గనిర్దేశనం చేసి.. వాళ్లు సాధించిన విజయాలనే తమ విజయాలుగా భావిస్తూ పొంగిపోతుంటారు. అంతటి గొప్ప గొప్ప గురువులున్న ఉపాధ్యాయ వృత్తిలో కొందరు చీడ పురుగులు కూడా ఉండటం శోచనీయం. పవిత్రమైన విద్యాలయానికి వచ్చి కొంత మంది ఉపాధ్యాయులు పీకల వరకు తప్ప తాగి ఒంటి మీద సోయి లేకుండా పడిపోతుంటే.. మరికొంత మంది ఉపాధ్యాయులు కూతుర్ల వయసున్న అమ్మాయిల ఒంటిపై కన్నేసి.. అసభ్యకరంగా తాకుతూ పైశాచికానందం పొందుతున్నారు. మరికొంత మంది ఏకంగా అత్యాచారాలకు పాల్పడుతూ ఉపాధ్యాయ వృత్తిలోనే చీడ పురుగుల్లా మిగిలిపోతున్నారు.
అలాంటి కోవకు చెందిన ఓ ఉపాధ్యాయుడు.. డౌట్లు క్లియర్ చేస్తానంటూ స్పెషల్ క్లాసులు పేరుతో పదో తరగతి విద్యార్థులను అసభ్యకరంగా తాకుతూ పైశాచికానందం పొందుతున్నాడు. రాజేంద్రనగర్ బుద్వేల్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ రావు అనే మాస్టారు వికృత చేష్టలపై పదో తరగతి విద్యార్థులు ఎంఈవోకు ఫిర్యాదు చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు. దీంతో.. ఈ సారు అసలు విషయం బయటికి వచ్చింది.
బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో వేణుగోపాల్ రావు ఫిజిక్స్ టీచర్గా కొనసాగుతున్నారు. కాగా.. వేణుగోపాల్ రావు తీరుతో అటు తోటి ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు ముందు నుంచే ఇబ్బంది పడుతున్నారు. తనకు ఇష్టమైన సమయానికి స్కూల్కి వచ్చేవాటని.. తోటి ఉపాధ్యాయులతోనూ దురుసుగా ప్రవర్తించేవాడని.. ఏం చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడని స్కూల్ ప్రిన్సిపల్ వివరించారు.
అయితే.. తాను కేవలం పదో తరగతి బాలికలకు మాత్రమే స్పెషల్ క్లాసులు చెబుతానంటూ... తరగతి గదిలో అమ్మాయిలోత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మాయిలతో డబుల్ మీనింగ్లో మాట్లాడుతూ.. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. స్కూల్ అయిపోయిన తర్వాత డౌట్స్ క్లీయర్ చేస్తానని ఇంటికి రమ్మని పిలిచేవాడు. అతని వికృత చేష్టలు భరించలేకపోయిన విద్యార్థినులు.. తనతో మొత్తం చెప్పారని.. తాను ఆయనను గట్టిగా మందలించానని ప్రిన్సిపల్ చెప్పారు.
తన మాటలు కూడా లెక్క చేయకుండా తనపైనే దుర్భాషలాడినట్టు ప్రిన్సిపల్ తెలిపారు. వారం రోజులుగా ఇష్టానుసారంగా వీడియోలు తీస్తూ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నట్టు వివరించారు. సోమవారం (నవంబర్ 11న) విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్ల విషయం గురించి ప్రశ్నించగా.. దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. ఇక చేసేదేమి లేక తనతో పాటు టీచర్లు, విద్యార్థినులు పాఠశాల బయట నిరసన వ్యక్తం చేశాన్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వచ్చి వేణుగోపాల్ రావును స్టేషన్కి తరలించారు. ఆ కీచక టీచర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఈవోకి ఫిర్యాదు చేశాం. ఈ విషయంపై స్పందించిన ఎంఈవో శంకర్ నాయక్.. వేణుగోపాల్ రావుని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం వేణుగోపాల్ రావును పోలీసులు విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa