ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాయపడిన వ్యవసాయకులను పరామర్శించిన దేవరకద్ర ఎమ్మెల్యే సతీమణి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 09:51 PM

దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం భూత్కూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం మంగళవారం ఉదయం బొలెరో వాహనంలో వెళుతుండగా జాతీయ రహదారిపై బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే సతీమణి జి. కవిత మధుసూదన్ రెడ్డి వనపర్తి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి గాయపడ్డ కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa