ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు, బాలకృష్ణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 09:05 PM

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటు కారణంగా మృతి చెందారు. తమ్ముడి మరణవార్త తెలిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. తమ్ముడి భౌతికకాయానికి ఆయన నివాళి అర్పించారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌, పురందేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబసభ్యలు ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఇంకోవైపు, చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో రేపు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు ప్రకటించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa