ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2014 తరువాత అదానీ సంపద ఎలా పెరిగిందో చూశాం : మహేష్ కుమార్ గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 04:25 PM

గౌతమ్ అదానీ కుంభకోణాన్ని అమెరికా అధికారులు బట్ట బయలు చేశారని.. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.తాజాగా ఆయన గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అదానీ పై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపై విచారన జరిపేందుకు తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.అదానీ దాదాపు రూ.2వేల కోట్ల మేర లంచాలు పంచారు. ఆయన అవినీతిపై రాహుల్ గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ స్పందించలేదు. అర్హత లేకపోయినా అదానికీ రూ.వేల కోట్లు రుణాలు ఇచ్చారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అండతో అనేక విమానాశ్రయ కాంట్రాక్టులు దక్కించుకొని అవినీతి సామ్రాజ్యం స్థాపించారు. 2014 తరువాత అదానీ సంపద ఎలా పెరిగిందో చూశాం. రూ.100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సీఎంలను జైలులో వేశారు. రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa