ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోజే కాంగ్రెస్‌లోకి వస్తానన్నారు.. తెరవెనుక సీక్రెట్ రివీల్ చేసిన ఎమ్మెల్యే..!?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2024, 07:28 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్ట్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో.. తెరెవెనుక జరిగే సీక్రెట్లను కూడా రీవిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసారు. కాళేశ్వర రావు కాస్త ఇప్పుడు కూలేశ్వర రావుగా మారిపోయారంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెటైర్లు వేశారు. హరీష్ రావు చేసిన కామెంట్లకు.. ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.


హరీష్ రావు కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని.. ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీక్రెట్‌గా కలిసి.. తాను కాంగ్రెస్‌లోకి వస్తానంటు బతిమాలుకున్నారని కామెంట్ చేశారు. హరీష్ రావు చేస్తున్న ప్రయత్నాలు తెలియటంతో.. కేసీఆర్ కూడా ఆయనను దూరం పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ దూరం పెట్టటంతో.. కనీసం హరీష్ రావు వార్తలు కూడా మీడియాలో రాలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


హరీష్ రావుకు అన్ని తెలిసినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించిన ఆది శ్రీనివాస్.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీష్ రావుకు ఎక్కడిదని మండిపడ్డారు. హరీష్ రావు మార్ఫింగ్ సినిమా చూపిస్తున్నాడని.. బీఆర్ఎస్ సినిమా అయిపోయిందంటూ చమత్కరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోందన్నారు.


రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును చూసి హరీష్ రావు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో రైతులకు రూ.80 వేల కోట్లు వేశామని హరీష్ రావు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని.. కానీ తాము మాత్రం 10 నెలల్లోనే రూ.22 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఆది శ్రీనివాస్‌. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందని.. వాగులు, వంకలు, కొండలు, కొనలకు గత ప్రభుత్వం రైతుబంధు డబ్బులు వేసిందని ఆరోపించారు. ఈసారి.. కౌలు రైతులకు కూడా బోనస్ ఇచ్చామని శ్రీనివాస్ తెలిపారు.


కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను పంట చేలల్లో బెదురుకు వాడిన విషయం మర్చిపోవద్దని.. గత పదేండ్లలో ఒక్క డీఏస్సీ కూడా వేయలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే లాభం ఏంటి? అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులు బీసీ కుల గణనకు అనుకూలమా.. వ్యతిరేకమా అన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa