ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీక్ష చేపట్టిన మాలధారణ భక్తుల సామూహిక గిరి ప్రదక్షిణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 04:55 PM

 తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కొండచుట్టూ అయ్యప్పస్వామి దీక్ష చేపట్టిన మాలధారణ భక్తుల సామూహిక గిరి ప్రదక్షిణ పర్వం బుధవారం భారీ ఎత్తున జరిగింది. వేకువ జామున కొండకింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరి ప్రదక్షిణ చేపట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతో గిరి ప్రదక్షిణ దారి కిట కిట లాడింది. ఈ పర్వంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ ఈఓ భాస్కర్ రావు పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa