ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రులును అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 02:30 PM

తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి. సత్యవతి రాథోడ్  మరియు బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులను  వికారాబాద్ లో అడ్డుకొని అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కంచర్ల రవి గౌడ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో  భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో  విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. తను మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకులు  గురుకుల బాట చేపడితే ఈ కాంగ్రెస్ సర్కారు ఉలికిపాటు పడుతుందని.  ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళితే మాజీ మంత్రులు ఆడబిడ్డలు  అని చూడకుండా  ఇలా అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం సరికాదు అని ఇది ముమ్మాటికి  ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రే అని ఆయన అన్నారు.
మొన్నటి రోజున  వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో  30 మంది విద్యార్థులు  అస్వస్థకు గురై అయ్యారని వారి పరిస్థితి ఎలా ఉందో అని   తెలుసుకొని పరామర్శించేందుకు వెళ్తున్న  బి. ఆర్.ఎస్ మాజీ మంత్రులను  అడ్డుకొని అరెస్టు చేయడం హేయమైన చర్యగా  భావిస్తున్నామని  విద్యార్థులను పరామర్శించేందుకు వెళితే  హాస్టలలోని బండారం బయటపడుతుందని  కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. అందుకే ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని. తెలంగాణ రాష్ట్రంలో  బడుగు బలహీన పేద విద్యార్థులకు ఆహారం పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని . ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి  ఈ సంవత్సర కాలంలో  50 కి పైగా మరణాలు  700కు పైగా  ఫుడ్ పాయిజన్ తొ ఆస్పత్రి పాలయ్యారని .  విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో  కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద  విద్యాశాఖ పెట్టుకున్న  ఇంతవరకు నోరు మెదపకపోవడం  ఎన్ని ఘటనలు జరిగినా  దున్నపోతు మీద వర్షం పడ్డట్టు  రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని. ప్రధాన ప్రతిపక్షమైన  బి .ఆర్ .ఎస్ నాయకులు  ఎప్పటికప్పుడు ఈ  ప్రభుత్వం చేస్తున్న అన్యాలను అక్రమాలను అరికడుతుంటే  కాంగ్రెస్ ప్రభుత్వంనికి పాలన చేయడం చేతకాక ఇలా ఎక్కడికి అక్కడ నిర్బంధించడం అక్రమ అరెస్టు చేయడం చాలా దురదృష్టమని . ముఖ్యమంత్రి  ప్రకటనలు చేయడం తప్ప  వాటి అమలు చేయడంలో  పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని  అయినా అన్నారు.  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్  రాష్ట్రంలో గురుకులాలను వెయ్యికి పెంచి విద్యార్థులను  ప్రపంచంతో  పోటీపడేలా  విద్యతో పాటు  మంచి నాణ్యమైన ఆహారాన్ని  అందించారని . వాటిని అన్నిటినీ ఈ  కాంగ్రెస్ తుంగలో తొక్కారు అని .ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు   స్పందించి ఇలాంటి ఘటనలకు కారణమైన  అధికారులను ఉద్యోగాల నుండి తొలగించి  వారికి సరైన శిక్ష వేయాలని ఇలాంటి సంఘటనలు  పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం న్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ . నాయకులుముగ్ధం అనిల్ గౌడ్.నవీన్ కుమార్. కొడం వెంకటేష్. సామల శ్రీకాంత్.ఎండి అక్రమ్.అస్లాం వినయ్ . తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa