కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల వివరాలను అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీలో సర్వే చేపట్టారు ఈ సందర్భంగా ఈవో రమేష్ మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణానికి 1689 ఇండ్లు మంజూరైనట్లు అట్టి లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నామని ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు నమోదు చేస్తున్నామని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండ్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి గూడు నీడ కల్పించాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల యాప్ తీసుకువచ్చినట్లు తెలిపారు. అలాగే సర్వేను చేపడుతున్నట్లు సర్వేలో పేదవాళ్లు ఎవరైతే ఉన్నారో వారికి పార్టీలకు అతీతంగా ఇల్లు లేని వారికి ఇండ్లు కల్పిస్తామని ప్రజా పాలనలో భాగంగా ఇండ్లులేని ప్రజలు దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని దాని ప్రకారమే పంచాయతీ అధికారులతో సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటే వారిని గుర్తించి వారికి ప్రభుత్వం తప్పకుండా ఇల్లు కల్పిస్తుందని అన్నారు ఎవరైనా నిరుపేదలు ఇల్లు లేదని ఆందోళన చెందవద్దని అన్నారు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని మాయ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు కాంగ్రెస్ నాయకులు దిటి నర్సింలు. ఉచ్చిడి బాల్ రెడ్డి. భాను. రంజాన్. నరేష్. శీల ప్రశాంత్. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa