పెద్దపల్లి పట్టణంలో (టి ఎఫ్ ఐ డి సి ) నిధుల ద్వారా త్వరలో ప్రారంభం కానున్న పనులను శుక్రవారం రోజున మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ...పెద్దపల్లి పట్టణ అభివృద్ధి కొరకు నెల రోజుల క్రితం 30 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేసుకుని పనులు మొదలు పెట్టడం జరిగిందని 9 ప్యాకేజీలకు గాను 7 ప్యాకేజీల పనులు మొదలు పెట్టడం జరిగిందని ఈనెల 4వ తేదీన పెద్దపెల్లి పట్టణానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఏనుమల రేవంత్ రెడ్డి పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అందులో భాగంగా 4 ఎకరాల స్థలంలో నాలుగు కోట్ల రూపాయలతో పార్కు ఏర్పాటు చేసుకోవడం మిగతా 11 కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణంలోని అన్ని వార్డుల్లో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు, మురికి కాలువలు.
ఇతరత్రా పనులను చేసుకోవడం జరుగుతుంది అని పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి రానున్న ఆరు నెలల్లో మరో 45 కోట్ల రూపాయల తో పనులు చేయుటకు అనుమతులు తీసుకోవడం జరిగిందని పెద్దపల్లి పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం నుండి జెండా చౌరస్తా వరకు,జెండా చౌరస్తా జెండా నుండి మజీద్ వరకు అలాగే జెండా నుండి సుభాష్ విగ్రహం వరకు 75 లక్షల రూపాయలతో 40 ఫీట్లతో బిటి రోడ్డు పనులను త్వరలోనే మొదలు పెట్టడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఏఈ గకౌన్సిలర్లతో కలిసి రోడ్డు వెడల్పు స్థలాలను పరిశీలించడం జరిగిందని పెద్దపల్లి పట్టణ ప్రజలకు వారి అనుకూలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, మురికి కాలువలు నిర్వహించడం జరుగుతుందని పెద్దపల్లి పట్టణ ప్రజలు సహకరించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్,కౌన్సిలర్లు నూగిల్ల మల్లన్న,భూతగడ్డ సంపత్,పాగల సోని శ్రీకాంత్,మున్సిపల్ ఏఈ సతీష్ టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్,మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa