ట్రెండింగ్
Epaper    English    தமிழ்

28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 19, 2024, 11:29 AM

హైదరాబాద్‌ శివారులో రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 28న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఈ టెర్మినల్‌‌లో దాదాపు 10 ప్లాట్‌ఫాంలు ఉండగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచే మొదలు కానున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ టెర్మినల్‌ను నిర్మించింది.టెర్మినల్‌ ప్రారంభమైన తర్వాత 25 జతల రైళ్లు ఇక్కడి నుంచి పరుగులు తీయనున్నాయి. ప్రతిరోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ 13 జతల రైళ్లు ఆగుతున్నాయి. వీటిలో ప్రధానంగా కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ, కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్‌సిటీ, మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, పుష్‌-పుల్‌ (సికింద్రాబాద్, వరంగల్‌), శబరి ఎక్స్‌ప్రెస్, శాతవాహన, కాకతీయ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి, ఘట్‌కేసర్‌ ఎంఎంటీఎస్, రేపల్లె ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. 25 జతల రైళ్లు పరుగులు తీస్తే నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. దీనికితోడు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa