ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుణమాఫీ చేయాలని పంట పొలాల్లో ఉరితాడుతో ఆందోళనకు దిగిన రైతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2024, 03:04 PM

ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇంకా రైతు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని, ఇక తమకు మిగిలింది ఉరితాడేనని ఇచ్చోడ మండలం ముఖరా (కే) గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు.
ఈ మేరకు పంట పొలాల్లో తాడు కట్టి ఉరి పెట్టుకొని నిరసన తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే వేయాలని.. లేనిపక్షంలో తమకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa