ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగి ఐదుగురు యువకులు మృతి, ఇద్దరు క్షేమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 11, 2025, 07:16 PM

సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా విహారానికని వెళ్తే.. అది కాస్త తీరని విషాదంగా మారింది. కొండపోచమ్మ సాగర్‌కు విహారానికి వెళ్లిన ఐడుగురు యువకులు.. సెల్ఫీ కోసం నీళ్లలో దిగగా.. ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు వదిలారు. కాగా.. ఇద్దరు యువకులను స్థానికులు కాపాడటంతో.. ప్రాణాలతో బయటపడ్డారు. యువకులంగా.. హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. యువకులంతా 20 ఏళ్ల లోపువారేనని గుర్తించారు.


సంక్రాతి సెలవులు రావటంతో.. హైదరాబాద్‌ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్, లోహిత్, చీకట్ల దినేశ్వర్, సాహిల్, జతిన్, మృగాంక్, ఇబ్రహీం.. ఏడుగురు స్నేహితులు కలిసి.. సిద్దిపేటలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో.. కొండపోచమ్మ సాగర్ అందాలు ఆస్వాధిస్తూ.. నీళ్లలోకి దిగారు. నీళ్లలో కాసేపు ఆనందంగా కేరింతలు కొట్టారు. లోపలికి దిగి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో.. ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగిపోయారు. అయితే.. యువకులకు ఈత రాకపోవటంతో ఒకరి చేతు ఒకరు గట్టిగా పట్టుకోవటంతో.. అందరూ నీటిలో మునిగిపోయారు. ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడగా.. వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గజఈతగాళ్ల సాయంతో గల్లంతైన ఐదుగురు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు యువకులు గల్లంతవటంపై ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గల్లంతైన వారికోసం గజ ఈత గాళ్లను రంగంలోకి దింపాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని.. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.


చనిపోయిన ఐదుగురు యువకుల వివరాలు


1. ధనుష్ s/o నర్సింగ్, వయస్సు 20 సంవత్సరాలు, ఫోటో స్టూడియో వర్కర్


2. లోహిత్ s/o నర్సింగ్, వయస్సు 17 సంవత్సరాలు(ధనుష్ సోదరుడు)


3. చీకట్ల దినేశ్వర్ s/o కిషన్, వయస్సు 17 సంవంత్సరాలు


4. సాహిల్ s/o దీపక్ సుతార్, వయస్సు 19 సంవత్సరాలు


5. జతిన్ s/o గోపీనాథ్, వయస్సు 17 సంవత్సరాలు, డిప్లొమా, ఖైరతాబాద్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa