ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుంది : మంత్రి పొన్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 17, 2025, 12:28 PM

జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి మండల మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.తెలంగాణ ప్రజలకు కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న… 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు.ఇప్పుడు పాత 90 లక్షల రేషన్ కార్డులు చర్చ కాదని వివరించారు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లి అయిన వారికి,కొత్త కుటుంబాలు , మార్పులు చేర్పులు ,అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త అన్నారు. వారికి జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఇస్తుందని ప్రకటించారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి , ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు..పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దానిని నమ్మవద్దని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com