ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటు సారాయి స్థావరాలపై దాడులు: కాగజనగర్ ఎక్ససిస్ సి ఐ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2025, 03:44 PM

చింతలమానేపల్లి మండలంలోని లంబడిహెట్టి, రణవెల్లి గ్రామాల్లోని నాటుసారాయి స్థావరాలపై దాడులు నిర్వహించి  (60) లీటర్ల  నాటుసారాయిని, నాటుసారాయి తయారీలో వాడే (30) కిలోల బెల్లముని, (10) కిలోల పటికని స్వాధీన పరచుకుని, (6) కేసులు నమోదు చేసి (4000) లీటర్ల  బెళ్ళం పానకం ధ్వంసం చేసి నాటు సారాయి, గంజాయి మరియు మత్తు పదార్ధాల వలన కలిగె దృష్ప్రభావాల గురించి అవగాహన సదస్సు నిర్వహించడమైనది.
(8) మంది నేరస్తులని చింతలమానేపల్లి  తహశీల్దార్ మునావర్ షరీఫ్ గారి ముందర బైండోవర్ చేసినట్టు కాగజనగర్ ఎక్ససిస్ సి ఐ , రవి తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్  ఎస్సైలు పి.లోభానంద్, ఐ.సురేష్, పి.రాజేశ్వర్ మరియు సిబ్బంది పాల్గొన్నట్టు తేలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa