ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు బీజేపీ నాయకులు. నాలుగు గ్యారెంటీలను పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆపార్టీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి మాట్లాడుతూ, వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.
వన్ ఇయర్ తర్వాత వన్ విలేజ్ అనడం తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి ఒక్క గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో 4 పథకాలను అమలు చేస్తాం’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడడం సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మండల సీనియర్ నాయకులు ఎడ్ల జోగిరెడ్డి, చింతం శ్రీనివాస్, బోనాల మోహన్, ఎర్రోజు లక్ష్మణ్, వేల్పుల రవి, గొట్టెముక్కుల తిరుపతి రెడ్డి, గడ్డం అరుణ్, దుర్శెట్టి రమేష్, పబ్బ తిరుపతి, తమ్మనవేణి రాజు, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్, అన్నాడి రమణారెడ్డి, గొల్ల గణేష్, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa