శ్రీ రాజరాజేశ్వర సప్వామి ఆలయం ప్రక్కన బ్రహ్మశ్రీ చిదిరె కృష్ణమూర్తి శర్మ, వెంకటరమణ శరమ శ్రీనివాస శర్మల, మధుసూధన శర్మలు కానుకగా ఇచ్చిన స్థలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఈనెల 8వ తేదిన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సదర్బంగా బుధవారం శ్రీ సీతారామ చంద్రస్వామి విగ్రహాలతో పాటు ఇతర విగ్రహాలను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి పబ్బతి హనుమాన్ మందిరం వద్ద నుంచి శ్రీ రాజరాజేశ్వర దేవాలయం వరకు ఊరేగించారు. ఆర్యవైశ్య మహిళా సంఘంనకు చెందిన మహిళలు మంగళహరతులతో ముందుకు నడవగా, పురుషులు కాషాయ కండువాలు, జెండాలతో నడిచారు. డీజే సౌండ్తో యువకులు నృత్యాలు చేసుకుంటూ ముందుకు కదిలారు.
డుగడుగునా భక్తులు విగ్రహాలకు పూజలు చేస్తూ వాహనం ముందు పూజలు చేశారు. ఈనెల 8 వ తేది వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, శివస్వాములు, ఆలయ అర్చకలు వెంకటరమణ శర్మ, మాజీ కౌన్సిలర్లు నాగరాజు, ఆర్.సురేష్, మాజీ ఎంపీటీసీ పి.శివశేఖర్, మాజీ వార్డు సభ్యులు ప్రవీణ్కుమార్, వీరహనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మన్ గుప్త, వెల్డింగ్ మాణయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa