ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 02:26 PM

మండల పరిధిలోని పామేన గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కృష్ణమోహన్ ఆహ్వానం మేరకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ప్రతిష్టించిన మైసమ్మ, దుర్గమ్మ, సరోజినమ్మ గ్రామ దేవతలను  దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రతి పల్లెలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని అన్నారు. గ్రామ సమైక్యత కోసం గ్రామ దేవతల విగ్రహలు ఏర్పాటు ఎంతో సహకరిస్తుందన్నారు. ఆచార సంప్రదాయాలను గౌరవించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అనంతరం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ఈ విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమం పార్టీలకతీతంగా జరుపుకునే గ్రామ పండుగ అని అన్నారు. గ్రామదేవతల కరుణకటక్షాలకు గ్రామస్తులు పాత్రులు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గ్రామ దేవతలు ప్రజలను సల్లగా చూడాలని కోరుకుంటునన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దవల్గారి గోపాల్ రెడ్డి, శ్రీరామ్ నగర్ మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, యువ నాయకులు మల్గారి వైభవ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్, ఓబీసీ అధ్యక్షులు కుమార్ గౌడ్, నాయకులు వెంకట్రామ్ రెడ్డి, బర్ల కృష్ణ, పెద్దల కృష్ణ, శ్యామ్ రెడ్డి, రాములు, నర్సిములు, నరేందర్ రెడ్డి, మల్లారెడ్డి, రమేష్, విజయ్ కుమార్, సత్తయ్య, రాజేందర్ రెడ్డి, మల్లారెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa