ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రకటించిన చంద్రబాబు.. క్రిస్మస్కు ఒకరోజు ముందే నిధులు విడుదల చేశారు. డిసెంబర్ 25 క్రిస్మస్ నేపథ్యంలో పాస్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 8,418 మంది పాస్టర్లకు గౌరవ వేతనం కింద.. రూ.50.50 కోట్లను బుధవారం రోజున విడుదల చేసింది. క్రిస్మస్ రోజు నాటికి పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామన్న చంద్రబాబు..ఒకరోజు ముందే పాస్టర్లకు నిధులు విడుదల చేశారు. 8,418 మంది పాస్టర్లకు నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం చొప్పున ఏడాదికి రూ.60 వేలు అందించనున్నారు.
డిసెంబర్ 22వ తేదీన విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో క్రైస్తవుల గౌరవానికి, భద్రతు భంగం కలుగనీయమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందని.. ప్రతి మతాన్నీ గౌరవిస్తుందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి క్రైస్తవ సంస్థలు విద్యా రంగంలో సేవ చేస్తున్నాయని.. లక్షలాది మంది జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి క్రైస్తవుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు వెల్లడించారు.
2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో 977 చర్చిల నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.77 కోట్లు అందించిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఐదేళ్లలో 377 చర్చి నిర్మాణాలు పూర్తి అయ్యాయని.. మిగతా వాటికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. జెరూసలేం వెళ్లే వారికి ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని వివరించారు.
మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రిస్మస్ పండుగను ప్రభుత్వం తరపున తొలిసారిగా నిర్వహించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ప్రారంభించామని వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పాస్టర్లకు నెలకు 5 వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలను క్రిస్మస్ నాటికి అందిస్తామన్న చంద్రబాబు.. అన్నట్లుగానే ఒకరోజు ముందే పాస్టర్ల బ్యాంక్ అకౌంట్లలోకి రూ.50.50 కోట్లు విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa