దేవరకొండ పట్టణంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ సమీపంలో రహదారిపై ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆశాస్త్రీయంగా ఉందని పత్రాలను, ప్రభుత్వ దిష్టిబొమ్మను మాల మహానాడు నాయకులు దగ్ధం చేశారు ఈ సందర్భంగా మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి మాట్లాడుతూఇటీవల అసెంబ్లీ లో ఆమోదించిన ఎస్సీవర్గీకరణ అంశం పూర్తిగా అశాస్త్రీయమైనదని, సూప్రీంకోర్ట్ తీర్పుకు విరుద్ధంగా వర్గీకరణ చేపట్టారని దేవరకొండ నియోజకవర్గం మలమహానాడు నాయకులు విమర్శించారు. కాంగ్రేస్ పార్టీకి అండగ నిలబడిన మాలలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేశారని వాఫోయారు, వర్గీకరణకు పూర్తిగా మద్దతిచ్చిన బిజేపి ప్రభుత్వం పాలిత రాష్ట్రాలలో ఎందుకు వర్గీకరణ అమలు చేయడం లేదని ప్రశ్నించారు, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు, మోడీ, చంద్రబాబు ల మెప్పుకోసమే రేవంత్ రెడ్డి దళితులను విభజించాడని అన్నారు, వర్గీకరణ ప్రక్రియ 2011 జనాభా లెక్కల ప్రకారం జరగడమే శాస్త్రీయం కాదని అన్నారు.
మాలల జనాభా ను పూర్తిగా తక్కువ చేసి చూపించారని అన్నారు.దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్, బహుజన మేధావి డాక్టర్ ఏకల రాజారావు, మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చెన్నయ్య, డివిజన్ ఉపాధ్యక్షులు చలి చీమల పర్వతాలు ,మాల మహానాడు డిండి మండల అధ్యక్షులు నారీమల్ల మల్లేష్, చందంపేట మండల అధ్యక్షులు గోకమల ఆంజనేయులు, కందుకూరు గ్రామశాఖ అధ్యక్షులు నారీమల్ల భాస్కర్, నారీమల్ల శ్రీనయ్య, నూనె ప్రసన్నకుమా,ర్ గోరటి అంజి, భయ్యా శ్రీను, నంది. వెంకటయ్య మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa