ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాజపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ద్వారానే సమస్యల పరిస్కారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 03:21 PM

బాజపా బలపర్చిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ద్వారానే ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలకు పరిస్కారం దొరుకుతుంది అని భారతీయ జనతా పార్టీ మెట్పల్లి మండల శాఖ అధ్యక్షులు కొమ్ముల రాజు పాల్ రెడ్డి అన్నారు. సోమవారం రాజపాల్ రెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఉపాధ్యాయుల సంక్షేమం హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు నిరంతరం కృషి చేస్తారని, చాలాకాలం నుంచి అపరిస్కృతంగా ఉన్న జీవో నెంబర్ 317 న్యాయం జరిగేలా పోరాటం,  ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన రెండో పెండింగ్ పిఆర్సి. ఫిట్మెంట్. డి ఎస్ అమలుకు కృషి చేస్తారని తెలిపారు.
ఉద్యోగస్తుల పెండింగ్ బకాయిలు పై ప్రభుత్వం పై ఒత్తిడి ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనంతో పాటు వైద్య బీమా కోసం ప్రభుత్వంతో చర్చలు, ఉద్యోగుల బదిలీలు ప్రమోషన్లలో పారదర్శక కోసం నిరంతర కృషి చేస్తారన్నారు. స్కాలర్షిప్ బాకాయిలను విడుదలయ్యేట్టు అభ్యర్థులు చిన్నమయిల్ అంజిరెడ్డి, కొమురయ్య లు పోరాటం చేస్తారన్నారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్లు మారు జనార్దన్ రెడ్డి జంగిటి శ్రీధర్ గుండనీ భూమన్న నల్ల వెంకటేష్ పీసు రాజేందర్ రమేష్ యాదవ్ సురేష్ రెడ్డి దినేష్ రాజశేఖర్ బోగంగాధర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa