సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరొకసారి రుజువు అయిందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం గాంధీభవన్ లోని ప్రకాశం హాల్లో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,, దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నాయకులకు ప్రజెంటేషన్ ఇచ్చి అవగాహన కల్పించారు.
అనంతరం నీలం మధు మీడియా తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలపై కాంగ్రెస్ నేతలకు సమగ్ర సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాల పై సంతోషంగా ఉన్నారన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తూ ఎస్సీ వర్గీకరణకు చొరవ చూపిస్తూ ఈ రెండు వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలువబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ బడుగులకు బలహీనవర్గాలకు అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో తీసుకువచ్చిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు కుటిల రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. బడుగులు బలహీనవర్గాల బీసీలు, రాజకీయంగా ఎదిగితే ఎందుకంత కడుపు మంట అని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. బీసీలు, ఎస్సీ వర్గాల ఓట్లు వేసుకుంటారని అయితే ఆ వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంటే చూసి ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన సర్వే లో కెసిఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులు తమ వివరాలు అందించకపోవడంతో పాటు తమ శ్రేణులు సైతం వివరాలు ఇవ్వకుండా నిరోధించడం బీసీలను అవమానించడమేనన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa