తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా దీపాదాస్ మున్షిని తప్పించి.. మీనాక్షి నటరాజన్ ను నియమించారు.మీనాక్షి నటరాజన్ (జననం 23 జూలై 1973) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు మరియు 2009 నుండి 2014 వరకు మాండ్సౌర్ నుండి పార్లమెంటు సభ్యురాలు , ఆమె పార్లమెంటులో ఒకే పదవీకాలం ఉన్నారు. నటరాజన్ మధ్యప్రదేశ్కు చెందిన వారు. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పని చేస్తున్నారు. 1999–2002 వరకు NSUI అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత 2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008లో AICC కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని మంద్సౌర్ నుండి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అయితే తర్వాత రెండు సార్లు ఓడిపోయారు. మీనాక్షి నటరాజన్ .. రాహుల్ గాంధీ టీమ్ సభ్యురాలిగా గుర్తింపు పొందారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఇంచార్జ్ గా బెంగాల్ కు చెందిన దీపాదాస్ మున్షిని నియమించారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కాబట్టి ఆమె పార్టీ వ్యవహారాలకే పరిమితం కావాలి కానీ ఆమె పాలనలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణ జరగకపోవడానికి కూడా ఆమె అడ్డం పడటమే కారణమన్న అసంతృప్తి కొంత మంది నేతల్లో ఉంది. అవసరమైనప్పుడు రాష్ట్రానికి రావడం కన్నా.. వచ్చిన వెంటనే ఓ పెద్ద బంగళా రెంట్ కు తీసుకుని ఇక్కడే ఉండి వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa