ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త అదృశ్యంపై భార్య ఫిర్యాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 01:26 PM

ఇంటి నుంచి బయలుదేరి బ్యాంకులో డబ్బులు తీసుకొస్తానని వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త అదృశ్యంపై భార్య ఫిర్యాదు చేసిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన యాదయ్య(48) తండ్రి జంగయ్య(లేట్) వ్యవసాయం చేస్తుండేవారు.
ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చేవెళ్లలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డబ్బులు తీసుకొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి ఇంటి రాకపోవడంతో, చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా కనబడకపోవడంతో ఎవరైనా దూరపు బంధువుల వద్దకు వెళ్లాడేమోనని వస్తాడేమోనని రెండు రోజులు వేచి చూసింది. ఇప్పటికీ భర్త ఆచూకీ లభించకపోవడంతో తన భార్య జయమ్మ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa