ఈ నెల 27 న జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య ను భారీ మెజారిటీతో గెలిపించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సిర్పూర్ నియోజక వర్గ ఇన్చార్జి కొయ్యల ఏమాజి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం కాగజ్ నగర్ రూరల్, కౌటల, చింతల మనేపల్లి మండలాల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏమాజి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాల్క కొమరయ్య బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని అన్నారు. శాసన మండలి లో ప్రజల గొంతుక వినిపించాలంటే వీరిని గెలిపించాలని కోరారు. డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న గ్రాడ్యుయేట్ ల సమస్యలు పరిష్కారం కావాలంటే బిజెపి ఎంఎల్సి అభ్యర్థి అంజిరెడ్డి నీ గెలిపించలని కోరారు.
ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా సమస్యల్లో ఉన్నారని బిజెపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ను గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. దేశంలో మోడీ నాయకత్వాన్ని బలపర్చడానికి బిజెపిని గెలిపించాలని అన్నారు. సమావేశానికి మండల అధ్యక్షులు పుల్ల అశోక్, కుంచాల విజయ్ కుమార్, దొకె రాము ఆధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, మాజీ ఎంపిపి తిరుపతి గౌడ్, కృష్ణ, నానాజీ, లచయ్య, మంచిర్యాల జిల్లా కార్యదర్శి గోవర్ధన్, సీనియర్ నాయకులు కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa