ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరుగుతున్న ఎండ తీవ్రత...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 01:03 PM

రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి.ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే బయట నిలబడలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎక్కడ బయటకు వస్తే సుర్రుసుమ్మంటోందని జనాలు జంకిపోతున్నారు.  సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.6 డిగ్రీల నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలుగా రికార్డు అయ్యింది.ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ-గద్వాల, కరీంనగర్‌, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, వనపర్తి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, పెద్దపల్లి, నారాయణ్‌పేట్‌, నల్లగొండ జిల్లాల్లో 37.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa