ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండగ సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 04:48 PM

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాలకు భక్తులు భారీగా తరలివస్తారు. వేములవాడ, కీసర వంటి పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.ఈ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా తరలి వచ్చే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని ఆదేశించారు. బస్టాండ్‌ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa