ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొల్లపెల్లిలో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రారంభం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:01 PM

జగిత్యాల జిల్లా యందలి గొల్లపెల్లి యందు ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క 57 వ శాఖను బ్యాంకు చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్యాంకు చైర్మన్,డైరెక్టర్లు,పురప్రముఖులు,సహకార అధికారులు,ముఖ్యకార్యనిర్వహణాధికారి పాల్గొని బ్యాంకు యొక్క వివిధ విభాగాలను ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన గాయత్రి బ్యాంకు నిరంతర కృషితో నేడు మల్టీస్టేట్ బ్యాంకుగా రూ॥ 3062.50 కోట్ల వ్యాపారాన్ని సాధించి తెలంగాణలోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో అతి పెద్ద బ్యాంకుగా అవతరించి కో-ఆపరేటివ్ వ్యవస్థలో అగ్రగామిగ పనిచేస్తున్నామని అన్నారు. గొల్లపెల్లి ప్రాంత ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకోని బ్యాంకును ఆదరించాలని కోరారు.
 బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకు ముఖ్య ఉద్దేశ్యం సామాన్య మధ్యతరగతి,వర్తక వాణిజ్య వర్గాల ప్రజలకు కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా సేవలందించడమేనని అన్నారు. 
అనంతరం బింగి తిరుపతి ఏజిఎం మాట్లాడుతూ వినియోగదారులు మాపై చూపిస్తున్న ఎనలేని ఆదరాభిమానాల వల్ల బ్యాంకును మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని, నగరవాసులు మరియు పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం బ్రాంచి హెడ్ నేరెళ్ళ మునీందర్ మాట్లాడుతూ ఆధార్ నంబరు ద్వారా నగదు బదిలీ పథకం క్రింద వచ్చు సబ్సిడీ బదలాయింపులను,ప్రభుత్వ ఆసరా పెన్షన్లను పొందవచ్చని,బంగారు ఆభరణాలపై ఋణాలను అందజేస్తామని రైతులకు వ్యాపారులకు ఆస్థి తనఖాపై ఋణ సౌకర్యం కల్పిస్తామని,వినియోగదారులు బ్యాంకును ఆదరించి ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యాపారులు,సహకార అధికారులు,బ్యాంకు పాలక వర్గ సభ్యులు,బ్యాంకు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa