ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిన్నెర హరికృష్ణ పై ఆరోపణలు తగవు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:05 PM

చందంపేట మండలం లోని 4 గ్రామాల మాజీ సర్పంచ్ లు తమ గ్రామాలలో 2022-2023 సంవత్సరం లో పల్లె ప్రకృతి వానలు & బృహత్ వనాల పనులకు సంబందించిన బిల్లులు వారు పదవి కాలంలో ఉన్నప్పడు వారికి "చెక్ పవర్" ఉన్నందున కొంత బిల్లు లు తీసుకున్నారు, అనంతరం మిగిలిన పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం విడుదల చేయలేదు, కాలక్రమేనా వారి పదవి కాలం పూర్తయిన తర్వాత గ్రామ పంచాయతీ ఖాతాలో "బిల్లులు" జమ చేస్తే కొత్తగా ఎన్నికైన పాలక వర్గం మరియు సర్పంచ్ లు తమకు ఇవ్వరని భావించి. చట్టపరంగా MB రికార్డులు ఉన్నందున   "కిన్నెర ట్రేడర్స్" ద్వారా వారికి బిల్లులు చెల్లించాలని ఎంపీడీవో కి వ్రాత పూర్వకంగా విన్నవించుకున్నారు, తదనంతరం ఎంపీడీవో  సైతం జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ (PD)కి వివరించగా "ట్రేడర్" ద్వారా తీసుకునే అవకాశం ఉన్నందున వారి అనుమతి తో  " కిన్నెర ట్రేడర్స్" ద్వారా బిల్లులు చెల్లించడం జరిగింది. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు.మా పార్టీలో ఉన్న అసమ్మతి నేతలు, మరియు ఎమ్మెల్యే గారికి గిట్టని వారు, ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి ఉద్దేశ్యపూర్వకంగా ఎమ్మెల్యేని,  బద్నాం చేయడానికి కుట్రలు పన్నినారు.
దళిదుడై కిన్నెర హరికృష్ణ ని రాజకీయంగా అణగదొక్కడం కొరకు జరుగుతున్న కుట్రలు ఈ కార్యక్రమంలో దేవరకొండ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముకురోజు రాజు ,చందంపేట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమావత్ సాయి రాథోడ్ ,మల్లేపల్లి యూత్ కాంగ్రెస్ అద్యక్షులు మూడవత్ మంగ్య నాయక్, చింతపల్లి మండల యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు మునుకుంట్ల శేఖర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఇస్మైల్, కొండ్రపల్లి సుజిత్, దేవరకొండ నియెజక వర్గ యూత్ కాంగ్రేస్ ఉప ఎన్నికలు అధ్యక్షులు షేక్ రహీం,ప్రధానకార్యదర్శి దుబ్బా చరణ్,జిల్లా ప్రధానకార్యదర్శి నేనావత్ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa