ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదంలో నాలుగు మృతదేహాలు వెలికితీసే అవకాశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 05:16 PM

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది గల్లంతవడం తెలిసిందే. వారు బతికుండే అవకాశాలు పూర్తిగా అడుగంటిపోయాయి. మృతదేహాల వెలికితీతకు సహాయక చర్యలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, పోలీసులు, హైడ్రా టీమ్, సింగరేణి బృందం, పలు ప్రైవేటు కన్ స్ట్రక్షన్ కంపెనీల బృందాలు తవ్వకాలు ముమ్మరం చేశాయి. కాగా, ఇవాళ నాలుగు మృతదేహాలు వెలికితీసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిరంతరంగా నీటి ఊట వస్తుండడంతో తవ్వకాలకు అడ్డంకిగా మారుతోంది. పూడికను, కత్తిరించిన టన్నెల్ బోరింగ్ మెషీన్ భాగాలను బయటికి తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో సహాయక చర్యల్లో ఆశించిన వేగం కనిపించడంలేదు! కాగా, సహాయక బృందాలు షిఫ్టుకు 120 మంది చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 18 ఏజెన్సీలు, 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa