టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు వి.వి. వినాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. అప్పటి నుంచి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. వి.వి. వినాయక్ అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలుసుకున్న దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.వి.వి. వినాయక్.. ఆది, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాల తర్వాత ఠాగూర్, అదుర్స్ లాంటి మాస్ మసాలా హిట్ మూవీలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే, కొన్ని సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో ఆయన సినిమాలకు విరామం ఇచ్చారు. చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'ఛత్రపతి' హిందీ రీమేక్ చేశారు. అయితే, ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును ప్రకటించలేదు. అంతేకాకుండా, ఆయన హీరోగా ప్రకటించిన సీనయ్య మూవీ ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa