తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్ష పడింది. ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా, చిన్నాన శ్రవణ్కు జీవిత ఖైదు పడింది. దీంతో ఆయన కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ‘ఏ తప్పు చేయకపోయినా తన తండ్రిని ఈ కేసులో ఇరికించారు. ఈ ఎపిసోడ్కు అమృతే కారణం’ అని శ్రవణ్ కుమార్తె మీడియా ముందు వాపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa